జీవో 317పై నివేదిక అందజేసిన కేబినెట్ సబ్ కమిటీ

by M.Rajitha |
జీవో 317పై నివేదిక అందజేసిన కేబినెట్ సబ్ కమిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ ఆదివారం తన తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జీవో 317పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పలువురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షత వహించగా.. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు సభ్యులుగా ఉన్నారు. జీవోలో గల సమస్యలపై పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలు, ఉన్నతాధికారులు, మేధావులతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది. అలాగే ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా ఉద్యోగుల అభిప్రాయాలను, వినతులను సేకరించింది. నేడు జీవోపై తుది నివేదికకు సంబంధించిన పత్రాలను సీల్డ్ కవర్ లో ఉంచి, సీఎం రేవంత్ రెడ్డికి సబ్ కమిటీ అందజేసింది. కాగా ఈ జీవోపై సీఎం త్వరలోనే అనుకూల నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story