- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
అయోధ్య కేసుపై సీజేఐ చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : అయోధ్య కేసుపై సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కేసు విషయంలో త్వరగా ఓ పరిష్కారం చూపమని భగవంతుణ్ణి ప్రార్థించానని వెల్లడించారు. సీజేఐ సొంత ఊరు అయిన కన్హేర్ లో నేడు ఆయనను సత్కరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అయోధ్య కేసు నడుస్తున్నపుడు ప్రతిరోజూ దేవుడి ముందు కూర్చొని.. త్వరగా సమస్యను పరిష్కరించమని వేడుకున్నానని తెలిపారు. భగవంతునిపై విశ్వాసం ఉంటే ఆయనే తప్పక మార్గం చూపిస్తాడని అన్నారు. అయోధ్య కేసులో 2019లో సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో చంద్రచూడ్ కూడా ఒకరు. ఈ కేసులో ధర్మాసనం వెలువరించిన చారిత్రాత్మక తీర్పు గురించి నేడు చంద్రచూడ్ గుర్తు చేసుకున్నారు.
Advertisement
Next Story