- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
కిన్నెర మెట్ల మొగులయ్యకు ఇంటి స్థలం ఇచ్చిన ఇచ్చిన సర్కార్
దిశ, వెబ్ డెస్క్ : పద్మశ్రీ అవార్డు(PadmaSri Award) గ్రహీత, ప్రముఖ కిన్నెర మెట్ల వాయిద్యకారుడు దర్శనం మొగిలయ్య(Darshanam Mogilaiah)కు తెలంగాణ సర్కార్ ఇంటి స్థలాన్ని అందించింది. హయత్ నగర్లో 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు మంగళవారం స్థల ధృవీకరణ పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్వయంగా మొగిలయ్యకు అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కళాకారులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. కాగా తనకు ఇంటి స్థలం కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణకి మొగిలయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ... భావోద్వేగానికి గురయ్యారు. కాగా దర్శనం మొగిలయ్య 2022లో కళారంగంలో చేసిన సేవలకు గాను భారతదేశ విశిష్ట పురస్కారం 'పద్మశ్రీ' అందుకున్నారు. గత ప్రభుత్వం అప్పట్లో నగదు బహుమతిని ప్రకటించగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలో ఇంటి స్థలాన్ని కేటాయించింది.