తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు

by karthikeya |
తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: మూసీ పరివాహక బాధితులను పరామర్శించేందుకు హరీష్ రావు, సబిత నాయకత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ భనవ్‌కు చేరుకున్నారు. బాధితులతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ కీలక నాయకులు సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం హైదర్ కోట వద్దకు వెళ్బబోతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు అడ్డుకోగా.. పోలీసులతో బీఆర్ఎస్ నాయకుల వాగ్వాదానికి దిగారు. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ తీరును, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు హరీశ్ రావు, సబిత ఇంద్రారెడ్డి వంటి నేతల ఆధ్వర్యంలో బాధితుల పరామర్శకు బయలుదేరారు.

Advertisement

Next Story

Most Viewed