రియల్ ఎస్టేట్‌పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. స్పందించిన హైడ్రా

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-20 06:00:36.0  )
రియల్ ఎస్టేట్‌పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. స్పందించిన హైడ్రా
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాలపై హైడ్రా(Hydraa) కమిషనర్ రంగనాథ్(Ranganath) స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టబద్ధమైన అనుమతులతో వెంచర్లు ఏర్పాటు చేసుకున్న వారు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చెరువుల వద్ద అనుమతులు ఉన్నా.. నిర్మాణాలు కూల్చివేస్తారని తమపై ప్రచారం చేస్తున్నారు. చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉన్న నిర్మాణాలు కూల్చివేయమని సీఎం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉంటుందని రంగనాథ్ అన్నారు. ఇదిలా ఉండగా.. శనివారం హైడ్రాపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

ప్రభుత్వ స్థలాలను, చెరువులను, కుంటలను, నాలాలను కబ్జా చేసినవారికి మాత్రమే హైడ్రా ఒక భూతం లాంటిదని, వారి పట్ల ఒక అంకుశంలాగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. పేదలను మాత్రం ప్రభుత్వం ఆదుకుంటుందని, వారికి అండగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. హైడ్రా, మూసీ పునరుజ్జీవనం వేర్వేరు అంశాలని నొక్కిచెప్పారు. ఇప్పటివరకు మూసీ పరిసరాల్లో కూల్చివేతలే జరగలేదని, హైడ్రా అటువైపు వెళ్ళనే లేదన్నారు. కేటీఆర్, హరీశ్‌రావులు వారి ఫామ్ హౌజ్‌లను కాపాడుకోడానికే పేదలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీయడానికి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక మూలాలను అస్థిరం చేయడానికి ఆ రెండు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. హైడ్రా ఆగదు.. ఆక్రమార్కులకు నిద్ర ఉండదు.. అని సీఎం రేవంత్ నొక్కిచెప్పారు.

Advertisement

Next Story