తెలంగాణ సారస్వత దిక్సూచి సురవరం: రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

by Disha Web Desk 1 |
తెలంగాణ సారస్వత దిక్సూచి సురవరం: రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రాంతంలో సాహిత్య చైతన్యానాకి పాదులు వేసిన ఘనత సురవరం ప్రతాపరెడ్డికి దక్కుతుందని రాష్ట్ర ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు జిల్లేల చిన్నారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో గురువారం తెలంగాణ సారస్వత పరిషత్‌లో తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి గ్రంథ స్వీకర్తగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో కవులు పూజ్యం అన్న మాటను సవాలుగా తీసుకొని గోల్కొండ కవుల సంచిక వెలువరించి ఈ ప్రాంత కవుల రచనలు వారి గొప్పదనాన్ని లోకానికి చాటారని పేర్కొన్నారు. డాక్టర్ అమ్మగి వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు శివారెడ్డి, బాలకృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, సురవరం కృష్ణవర్దన్ రెడ్డి, గంటా జలంధర్ రెడ్డి, పోరెడ్డి రంగయ్య, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed