ఏపీలో దొంగలపై తెలంగాణ పోలీసుల కాల్పులు

by Y. Venkata Narasimha Reddy |
ఏపీలో దొంగలపై తెలంగాణ పోలీసుల కాల్పులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో దొంగలపై తెలంగాణ పోలీసులు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం రామాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ చోరీ కేసులో విచారణకు వచ్చిన తెలంగాణ పోలీసులపై దొంగలు దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దొంగలు పోలీసుల నుంచి తప్పించుకుని పరారీ అయ్యారు. దొంగల ఆచూకీ కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. స్థానికులు, బత్తలపల్లి పోలీసులతో కలిసి దొంగల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story