దైవ దర్శనానికి వెళ్లి అనంతలోకాలకు

by Sridhar Babu |
దైవ దర్శనానికి వెళ్లి  అనంతలోకాలకు
X

దిశ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలంలోని సీతంపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా సమీపంలో దైవదర్శనానికి వెళ్లి కృష్ణా నదిలో పడి మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీతంపేట గ్రామానికి చెందిన పోతన రాజేంద్రమ్ - సరస్వతి దంపతుల కుమారుడు వేణుగోపాల్ (38) ఈనెల 17న కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో కృష్ణానది సమీపంలో దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్లాడు.

కృష్ణా నదిలో స్నానం చేసేందుకు దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయాడు. రెండు రోజులుగా నది పక్కనే బ్యాగు ఉండటాన్ని చూసిన స్థానికులు సమీపంలోని యాపలదిండి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు విషయాన్ని మృతుడు వేణుగోపాల్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దాంతో వారు అక్కడికి వెళ్లి పోలీసుల సహకారంతో విచారణ చేపట్టగా సంఘటన స్థలం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో మృతదేహం లభించింది. దీంతో సీతంపేట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisement

Next Story