- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
తల్లీ కొడుకుల ప్రాణాలు తీసిన కరెంట్ వైరు
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : కాకినాడ జిల్లాలో కరెంటు వైర్లు తల్లీ కొడుకుల ప్రాణాలు తీశాయి. జిల్లాలోని సామర్లకోటలోని వీర రాఘవపురం సత్తమ్మ గుడి సమీపంలో నివసిస్తున్న చిట్టిమని పద్మ శనివారం కాలువ సమీపంలో మృతి చెందింది. ఆదివారం ఆమె అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం ఆమె కుమారుడు విశ్వేస్ కాలువలో స్నానం చేసి, దుస్తులు పక్కన ఉన్న తీగ మీద ఆరేయగా, కరెంట్ షాక్ తో మృతి చెందాడు. కాగా పద్మ కూడా నిన్న అదేవిధంగా మృతి చెంది ఉండవచ్చునని స్థానికులు చెబుతున్నారు. ఒక్కరోజు వ్యవధిలోనే కరెంట్ షాక్ తో తల్లీ కొడుకులు మృతి చెందడంతో వీర రాఘవపురంలో విషాదం అలుముకుంది.
Advertisement
Next Story