- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తెలంగాణ కేఏ పాల్!.. హైదరాబాద్ బీజేపీ అభ్యర్ధి మాధవీలత చర్యలపై నెటిజన్లు ట్రోల్
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి మాధవీలత ప్రచారంలో వివిధ రకాలుగా ప్రవర్తిస్తూ ట్రోల్స్ భారిన పడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా ప్రచారం కొనసాగిస్తున్న మాధవీలత ప్రచార రథంపై తనదైన శైలిలో ప్రత్యర్ధులపై విమర్శలు చేస్తూ సంజ్ణలు చేస్తోంది. దీంతో ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఆమెను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా మసీదు వద్దకు రాగానే విల్లు ఎక్కుపెట్టి బాణం వేస్తున్నట్లు గా నటించారు.
దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెళ్లువెత్తడంతో తాను రాముడు బాణం ఎక్కుపెట్టినట్లు చూపించానని, మసీదు వైపు కెమెరా తిప్పారని చెప్పుకొచ్చారు. మళ్లీ అదే విధంగా రోడ్డుపై కూర్చొని విల్లు ఎక్కిపెట్టినట్లుగా చేశారు. ఇదిలా ఉండగా ప్రచారంలో భాగంగా గాలిపటం దారం లాగి దానిని తెంచుతున్నట్లుగా చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియోలపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆమె తెలంగాణ పాల్ అని, గత ఎన్నికల సమయంలో కేఏ పాల్ కూడా ఇలాగే ప్రవర్తించాడని నవ్వుకుంటున్నారు. ఆమెలో మరో నిత్యానంద కూడా కనిపిస్తున్నారని, ఆయన కూడా ఇలాంటి కామెడీలే చేసేవాడని ట్రోల్ చేస్తున్నారు.