మొరం తవ్వకాలపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు.. పేలుడు పదార్థాలు పట్టివేత

by Rajesh |
మొరం తవ్వకాలపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు.. పేలుడు పదార్థాలు పట్టివేత
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో అక్రమంగా మొరం తవ్వకాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అధికార పార్టీ అండతో సంవత్సరాలుగా మొరం మాఫియా రెచ్చిపోయి గుట్టలను మాయం చేసింది. శనివారం తెల్లవారు జామున అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతున్న మాక్లూరు మండలంలోని సింగంపల్లి, మాదాపూర్ గుట్టల్లో మైనింగ్‌పై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు నిర్వహించారు.

నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ రాజశేఖర్ రాజ్ ఏసీపీ ఆధ్వర్యంలో సీఐ అంజయ్య సిబ్బంది మాక్లూర్ మండల్ సింగంపల్లి శివారు మాదాపూర్ గ్రామంలో అక్రమ మైనింగ్ కేంద్రాలపై దాడులు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతున్న తవ్వకాల వద్ద జేసీబీలు 2, టిప్పర్ 4 స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే మొరం తవ్వకాల కోసం వినియోగిస్తున్న 120 కిలోల పేలుడు పదార్థాలు గుర్తించి సీజ్ చేశారు.

Next Story

Most Viewed