కేంద్ర బడ్జెట్‌పై తమ్మినేని వీరభద్రం హాట్ కామెంట్స్

by Satheesh |
కేంద్ర బడ్జెట్‌పై తమ్మినేని వీరభద్రం హాట్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తి రంగాల ప్రాధాన్యతను తగ్గించడంతో పాటు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఎలాంటి ప్రాధాన్యతా ఇవ్వలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో విమర్శించారు. దిగుమతులపై ఆధారపడే విధంగా దేశాన్ని మార్చే దిశగా ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన హామీల ఊసే ప్రస్తావన లేని ఈ బడ్జెట్‌ను తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌కు అదనంగా రు.4లక్షల కోట్లు పెంచి రు.48.20లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారని తెలిపారు.

బడ్జెట్‌కు ముందురోజు విడుదల చేసిన ఆర్థిక సర్వేలోనే వ్యవసాయ ఉత్పత్తి 4.7శాతం నుండి 1.4శాతానికి గ్రోత్ రేట్ పడిపోయినట్టు చెప్పారు. గత సంవత్సరం 32.89లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగా 2023-24 ఏడాదిలో రూ.32.16లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అయిందని తెలిపారు. ఒకవైపున జనాభా పెరుగుతుండగా ఆహారధాన్యాల ఉత్పత్తి పడిపోవడంతో దిగుమతులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రూ.20 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఏటా కోల్పోతున్నామని, నిరుద్యోగం పెరిగి గ్రామీణ ఉపాధి దెబ్బతింటున్నదన్నారు. దీనిపై ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. మొత్తంగా ఈ బడ్జెట్లో కార్పొరేట్ విధానాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు.

తెలుగు రాష్ట్రాల విభజన హామీలను అమలు జరపడానికి కేంద్ర బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఊసే లేదన్నారు. బడ్జెట్లో కేటాయింపులు లేవు. గిరిజన యూనివర్సిటీ ములుగులో ఏర్పాటు చేసినప్పటికీ అందుకు తగిన నిధులు కేటాయించలేదని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించలేదన్నారు. మూసీ ప్రక్షాళన గురించి రాష్ట్రప్రభుత్వం మొరపెట్టుకున్నా స్పందించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్యాస్ సబ్సిడీ, జల్ జీవన్ మిషన్ కింద తెలంగాణకు రు.16,100కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినప్పటికీ ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవని లోటుపాట్లను ఎత్తి చూపారు.

Advertisement

Next Story