Ramoji Rao: రామోజీ రావు మరణానికి కారణం క్షుద్రపూజలే.. శ్రీరెడ్డి

by Indraja |   ( Updated:2024-06-08 13:45:19.0  )
Ramoji Rao: రామోజీ రావు మరణానికి  కారణం క్షుద్రపూజలే.. శ్రీరెడ్డి
X

దిశ వెబ్ డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఈ రోజు తెల్లవారు జామున అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాధ చాయలు అలుముకున్నాయి. కాగా ఆయకు సీని ప్రముఖులు, రాజకీయ నేతలు నివాళులు అర్పిస్తున్నారు. అలానే రామోజీరావుతో తమకున్న అనుబంధం గురించి తెలుపుతూ.. ఆయన మరణంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఆరునెలలు సావాసం చేస్తే ఆళ్లు వీళ్లవుతారు అన్నట్టు పైశాచికత్వానికి పరాకాష్టగా మారింది శ్రీరెడ్డి. ప్రముఖ వ్యక్తి మరణించారని అందరూ సంతాపం తెలుపుతుంటే.. శ్రీ రెడ్డి మాత్రం చనిపోయిన వ్యక్తిపై సెటైర్లు వేస్తోంది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలు పెట్టేటప్పుడు పాపం తారక రత్న పోయాడు, పార్టీ గెలిచిన తరువాత రామోజీ రావు పోయాడు అని అమర్యాదగా మాట్లాడారు. వైసీపీ ఓడిపోవాలని మీరు క్షుద్రపూజలు ఏవో చేయించారంట, అయితే క్షుద్రపూజలు చేయించే సమయంలో జగన్ పేరుకు బదులుగా ఈనాడు అధినేత పేరు చెప్పారంట అని ఎద్దేవ చేశారు.

పాపం రామోజీ రావు క్షుద్రపూజలకు బలైపోయారు అని పైశాచిక ఆనంధాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. కాగా ఆ వీడియో చూసిన నెటిజన్స్ శ్రీ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

Next Story