ఘోర విషాదం.. ఏడుగురు ప్రాణాలు తీసిన దీపం

by Mahesh |
ఘోర విషాదం.. ఏడుగురు ప్రాణాలు తీసిన దీపం
X

దిశ, వెబ్‌డెస్క్: నవరాత్రుల్లో బాగంగా ఇంట్లో పెట్టిన ఓ దీపం ఏడుగురు ప్రాణాలు తీసింది. ఈ విషాద సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని చెంబూరులోని సిద్ధార్థ్‌ కాలనీలో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది స్థానికులు తెలిపారు. కాగా ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఇంట్లో పెట్టిన దీపం కారణంగానే మంటలు చెలరేగినట్లు గుర్తించారు. దుర్గా నవరాత్రి సందర్భంగా తెల్లవారు జామున గ్రౌండ్ ఫ్లోర్ లోని కారాణా షాప్‌లో పూజ అనంతరం దీపం వెలిగించారు. దీంతో ఆ దీపం షాప్ లోని వస్తువులకు అంటుకుంది. ఈ క్రమంలోనే షాప్‌లో నిల్వ ఉంచిన కిరోసిన్‌కు మంటలు అంటుకొవడంతో వేగంగా మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ లో ఉన్నవారు నిద్రలోనే సజీవదహనం అయినట్లు అధికారులు గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed