సెపక్​ తక్రా వరల్డ్​ కప్ – 2025

by M.Rajitha |
సెపక్​ తక్రా వరల్డ్​ కప్ – 2025
X

దిశ, తెలంగాణ బ్యూరో : సెపక్​ తక్రా వరల్డ్​ కప్​ 2025 పోటీలు ఇండియాలో నిర్వహిస్తున్నట్లు ఇంటర్నేషనల్​ సెపక్​ తక్రా ఫెడరేషన్​ వైఎస్​ ప్రెసిడెంట్​ ఎస్​ఆర్​ ప్రేంరాజ్​, సెపక్ తక్రా అసోసియేషన్ ఆల్ ఇండియా సెక్రటరీ, స్టేట్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఈ వరల్​ కప్​ పోటీలు మార్చి 20 నుంచి ఆరు రోజుల పాటు బీహార్​లోని పాట్నాలో ఉన్న పాటలీపుత్ర స్టేడియంలలో జరుగుతాయని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్​లో ప్రేంరాజ్​, పెరిక సురేష్ లు మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల నుంచి మహిళలు, పురుషుల జట్లు- పోటీ పడబోతున్నాయని అన్నారు. దేశంలో సెపక్ తక్రాకు పెరుగుతున్న ప్రజాదరణ ప్రాముఖ్యతను ప్రదర్శిస్తున్నామని తెలిపారు.

సెపక్​ తక్రా గేమ్స్​ఒక మైలురాయి..

భారతదేశం అంతటా సెపక్రాను ప్రోత్సహించడంలో ఈ వరల్డ్​గేమ్స్​ఒక మైలురాయి కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. టీమ్ ఈవెంట్, రేగు ఈవెంట్, డబుల్ ఈవెంట్, క్వాడ్ ఈవెంట్ నాలుగు విభాగాలలో మ్యాచ్​లను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ప్రత్యేకమైన క్రీడలో అథ్లెట్లు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, పోటీ స్ఫూర్తిని పెంపొందించడానికి ఒక వేదికను అందించడం ఈ ఛాంపియన్షిప్ లక్ష్యమని వారు పేర్కొన్నారు.

ఛాంపియన్ షిప్ నిర్వహణలో ఇంటర్నేషనల్​ సెపక్ తక్రా ఫెడరేషన్, ఆల్ ఇండియా అసోసియేషన్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా సురేష్ ప్రశంసించారు. సహకరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. "ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం దేశానికి గర్వకారణమనీ, ఇది మరింత మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని సురేష్ అన్నారు. పాట్నాలోని పాటలిపుత్ర ఇండోర్ స్టేడియంలలో జరిగే ఈ వరల్డ్​కప్​, ఇంటర్నేషనల్​ స్పెపక్​ తక్రా ఫెడరేషన్ స్పెపక్​ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తాయని తెలిపారు.

గేమ్స్​కు బీహార్​ సీఎం నితీష్, ఎంపీ ఈటల..

ఈ క్రీడ ప్రారంభోత్సవానికి బీహార్​ సీఎం నితీష్​కుమార్​ ముఖ్య​అతిథిగా హాజరవుతారనీ రాష్ట్రం నుంచి మల్కాజీగిరి ఎంపీ ఈటల రాజేందర్​ హాజరవుతారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో స్పెపక్​ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్​ డాక్టర్ ఎస్. ఆర్. ప్రేమ్ రాజ్, తెలంగాణ అధ్యక్షుడు సురేష్ కుమార్ తో పాటు, వైస్​ ప్రెసిడెంట్​ జగన్నాథ్​ స్వామి, తెలంగాణ ఒలంపిక్​ అసోసియేషన్​ జనరల్​ సెక్రటరీ బాబురాం సాగర్​, 38 నేషనల్​ గేమ్స్​ డిప్యూటీ ఛీఫ్​ కే మహేశ్వర్​ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సెపక్​ తక్రా వరల్డ్​ కప్​ 2025 పోటీలకు హాజరు కావాలని ఈటల రాజేందర్​ ను ప్రేంరాజ్​, సురేశ్​ తదితరులు ఆహ్వానించారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed