సెంటిమెంట్ రాజకీయాల వల్ల ఏ ఉపయోగం లేదు: వొడితల ప్రణవ్

by Disha Web Desk 18 |
సెంటిమెంట్ రాజకీయాల వల్ల ఏ ఉపయోగం లేదు: వొడితల ప్రణవ్
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో పార్టీల అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా భానుడి ప్రతాపాన్ని సైతం లెక్కచేయకుండా కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు గురువారం ప్రచారం నిర్వహించారు. హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్‌లో హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు పాల్గొన్నారు. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెలిచాల రాజేందర్ రావుకి మద్దతుగా ప్రచారం చేశారు. రామరాజ్యం రావాలంటే కాంగ్రెస్ ఓటెయ్యాలని, రావణ రాజ్యం కావాలంటే బీజేపీ ఓటెయ్యాలని అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు సానుభూతితో ఓట్లు అడుగుతున్నారని సెంటిమెంట్ రాజకీయాల వల్ల ఏ ఉపయోగం లేదన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్, బీజేపీ పాలన వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ, హస్తం గుర్తుకు ఓటు వేసి వెలిచాలను గెలిపించాలని కోరారు.

Next Story

Most Viewed