హరీష్ రావును బీజేపీలోకి పంపాని కేసీఆర్ ప్లాన్: సామా రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
హరీష్ రావును బీజేపీలోకి పంపాని కేసీఆర్ ప్లాన్: సామా రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గుండు సున్నా రావడంతో కేసీఆర్ మరో కొత్త గేమ్‌కు తెరలేపారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తన అల్లుడు హరీష్​రావును బీజేపీలోకి పంపించేందుకు ప్రయత్నిస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. బిడ్డ, పార్టీ, ఆస్తులను కాపాడుకునేందుకు కేసీఆర్ కుట్రలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. దొంగ రాజకీయాలను ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నదని పిలుపు నిచ్చారు. ‘‘నువ్వు కొట్టినట్లు చేయు, నేను తిట్టినట్లు చేస్తా” అని కేసీఆర్ తన పాత ఎత్తుగడలను మళ్లీ అమలు చేసేందుకు సిద్ధమయ్యాడన్నారు.

హరీష్​రావును బీజేపీకి పంపి, తన పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. పైగా కాంగ్రెస్‌ను డ్యామేజ్ చేసేందుకు బీజేపీతో కుమ్మక్కయ్యారన్నారు. ఏం చేసినా, కాంగ్రెస్ ను దెబ్బ తీయడం కేసీఆర్ అండ్ పార్టీతో సాధ్యం కాదన్నారు. బీఆర్ఎస్ పూర్తిగా కూకటి వేళ్లతో క్రమంగా దానంతట అదే తొలగిపోతున్నదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశాయన్నారు. బీఆర్ఎస్ తన ఓటు బ్యాంక్ ను బీజేపీకి వేయించిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed