- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి పొన్నాల సంచలన వ్యాఖ్యలు
![కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి పొన్నాల సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి పొన్నాల సంచలన వ్యాఖ్యలు](https://www.dishadaily.com/h-upload/2024/05/04/332236-ponnala-lakshmaiah.webp)
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ నేతలవి మాటలే తప్ప చేతలు లేవని మాజీ మంత్రి పొన్నల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ భవన్లో గురువారం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేశారు, పాలకులు డిల్లీలో మకాం వేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటనల్లో తమ సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ కనిపించటం లేదన్నారు. ఆరుగురు మంత్రులను డిసైడ్ చేయలేని దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. మంత్రి వర్గ కూర్పులో ఎప్పుడూ సామాజిక సమతూకాన్ని కాంగ్రెస్ పాటించదని ఆరోపించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు. కాంగ్రెస్లో చేర్చుకున్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మేడి గడ్డ బ్యారేజ్పై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేసిందని, వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీల మాట మరిచిందన్నారు.