Revanth Reddy: కొమురం భీం జయంతి సందర్భంగా సీఎం ఘన నివాళులు

by Ramesh Goud |   ( Updated:2024-10-22 08:22:21.0  )
Revanth Reddy: కొమురం భీం జయంతి సందర్భంగా సీఎం ఘన నివాళులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు కొమురం భీం కు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కొమురం భీం ఫోటోతో ట్విట్టర్‌లో స్పెషల్ పోస్ట్ పెట్టారు. దీనిపై పోరాటానికి ఆరాధ్యుడు.. అడవి బిడ్డల హక్కుల సాధన యోధుడు కొమురం భీం జయంతి సందర్భంగా ఘన నివాళి అంటూ రాసుకొచ్చారు. కాగా కొమురం భీమ్ జల్-జంగల్-జమీన్, మా భూములు మాకే కావాలి అనే నినాదాలు ఇచ్చి, ఆదివాసీల హక్కుల కోసం, స్వయం పాలన కోసం అలుపెరుగని పోరాటం చేశారు. ఈ పోరాట యోధుడి జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed