Revanth Reddy: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సీఎం స్పెషల్ ట్వీట్

by Ramesh Goud |
Revanth Reddy: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సీఎం స్పెషల్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ట్విట్వర్ లో స్పెషల్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఫోటోకు సీఎం నమస్సుమాంజలి తెలుపుతున్నట్టుగా ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. దీనిపై బలహీనవర్గాల ఆత్మగౌరవ పతాక.. త్యాగానికి నిజమైన ప్రతీక.. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఘన నివాళి అంటూ రాసుకొచ్చారు. ఇక కొండా లక్ష్మణ్ బాపూజీ పుట్టిన రోజు వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కాగా ఆయన త్యాగాలకు గుర్తుగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.

Advertisement

Next Story

Most Viewed