BRAKING: హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట..

by Ramesh N |
BRAKING: హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్‌కు ఊరట..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు తాత్కాలిక ఊరట లభించింది. 2011లో తనపై నమోదైన రైలు రోకో కేసును కొట్టివేయాలని, ఎలాంటి ఆధారాలు లేకున్నా తనను నిందితుల జాబితాలో చేర్చారంటూ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే విచారణపై హైకోర్టు స్టే విధించింది.

మాల్కాజ్‌గిరి పోలీసుల నివేదిక మేరకు ప్రజాప్రతినిధుల కోర్టులో మాజీ సీఎం కేసీఆర్ కేసు విచారణకు వచ్చింది. ఈ క్రమంలోనే హైకోర్టు ఇవాళ విచారణను వాయిదా వేసింది. మరోవైపు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి.. విచారణ వచ్చే నెల 23 కి వాయిదా వేసినట్లు హైకోర్టు నాలుగో బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి వెల్లడించారు.



Next Story