గ్యారంటీల అమలు బాధ్యత మాది : రంజిత్ రెడ్డి

by Disha Web Desk 11 |
గ్యారంటీల అమలు బాధ్యత మాది : రంజిత్ రెడ్డి
X

దిశ, రాజేంద్రనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారంటీలను చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో సంపూర్ణంగా అమలు చేసే బాధ్యత తనది అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్ లో ఆయన గురువారం మధ్యాహ్నం రెండు సెట్ నామినేషన్ వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇతర నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం మీడియా పాయింట్ లో మాట్లాడుతూ.. తనకు ప్రధాన పోటీ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అని తెలిపారు.

దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధికి రాహుల్ గాంధీ పాంచ్ న్యాయ్ పేరుతో మేనిఫెస్టో తీసుకొచ్చారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముస్లింలు, సిక్కులు ఇతర వర్గాల వారు అందరూ బయటకు వచ్చి తమకు నచ్చిన పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారని తెలిపారు.

అదేవిధంగా తాము ఇంటింటికి ప్రచారం చేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చి పార్టీకి పూర్వ వైభవం వస్తుందని తెలియజేశారు. రాజేంద్రనగర్ లోని పిల్లర్ నెంబర్ 22 వద్ద నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశానికి ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.



Next Story

Most Viewed