ఏర్పుమాళ్ళ గ్రామంలో దొంగల బీభత్సం...

by Kalyani |
ఏర్పుమాళ్ళ గ్రామంలో దొంగల బీభత్సం...
X

దిశ, బొంరాస్ పేట్ :- వికారాబాద్ జిల్లా,బొంరాస్ పేట్ మండలంలోని ఏర్పుమాళ్ళ గ్రామంలో గురువారం అర్ధరాత్రి తాళం వేసి ఉన్న ఇండ్లలో దొంగతనం జరిగింది. సుమారు 17.5 తులాల బంగారం,11 లక్షల 51 వేల రూపాయలను నగదును దొంగలు అపహరించారు.(దొంగిలించారు) గ్రామానికి చెందిన వార్ల రమేష్ కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వెళ్లాడు. నూతన గృహ నిర్మాణం కోసం దాచిన 10 తులాల బంగారం,4 లక్షల రూపాయల నగదును, తిరుపతి దర్శనానికి వెళ్లిన బుడగజంగం మాసప్ప ఇంట్లో 11వేల రూపాయలను, గోనేలి నరసమ్మ ఇంట్లో బియ్యం డబ్బాలో దాచిన 2.5 తులాల బంగారం,50వేల రూపాయలను,హైదరాబాద్ లో ఉంటున్న నట్టలి వెంకటమ్మ ఇంట్లో ఉన్న బంగారం గొలుసు, ఇతర వస్తువులు కలిపి 3 తులాల బంగారం,తుర్క బువ్వమ్మ ఇంట్లో దేవుని ఉండిలో ఉన్న 60వేలతో పాటు,దాచుకున్న 30 వేల రూపాయలను,బాపల్లి హన్మంతు ఇంట్లో ఉన్న 2తులాల బంగారంను దొంగలు దొంగిలించినట్లు స్థానికులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి,వివరాలను సేకరించారు. బొంరాస్ పేట్ మండల కేంద్రంతో పాటు,పలు గ్రామాల్లో గత కొన్ని రోజులుగా వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటివి పునరావృతం జరగకుండా, పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవూఫ్ తెలిపారు.

Advertisement

Next Story