అనాథ ఆశ్రమంలో ప్రత్యక్షమైన మహిళ అఘోరీ నాగసాధు.. ఏం చేశారంటే..?

by Kalyani |
అనాథ ఆశ్రమంలో ప్రత్యక్షమైన మహిళ అఘోరీ నాగసాధు.. ఏం చేశారంటే..?
X

దిశ, బడంగ్ పేట్ : మాతృదేవోభవ అనాథ ఆశ్రమాన్ని మహిళా ఆఘోరీ నాగసాధు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా నాగసాధు ఆశ్రమాన్ని సందర్శించి, ఆశ్రమంలోని శ్రీశ్రీశ్రీ సహస్ర లింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నటువంటి మానసిక వికలాంగుల బాగోగులను తెలుసుకొని ఆశ్రమవాసుల సహయార్ధం క్వింటా బియ్యం, పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు గిరి ఇంత మంది అనాథ, మానసిక వికలాంగులకు అన్ని తానై సేవా కార్యక్రమలు నిర్వహించడం గొప్పవిషయమని, అనాథలకు సేవాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించారు. ఇలాంటి వారికి సేవా చేయడం భగవంతుని సేవాతో సమానం అని నాగ సాధు పేర్కొన్నారు.

Next Story

Most Viewed