Shadnagar: షాద్​నగర్​లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

by Maddikunta Saikiran |
Shadnagar: షాద్​నగర్​లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
X

దిశ, వెబ్‌డెస్క్:గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన రంగారెడ్డి(Rangareddy) జిల్లా షాద్​నగర్(Shadnagar)​ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షాద్​నగర్​ పట్టణం ఫరూక్​నగర్(Farukhnagr)​లోని శ్రీనివాస కాలనీ(Srinivasa Colony)లో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించిందని పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు.దీంతో పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. షాద్​ నగర్​ కోర్టు సమీపంలో ఇళ్ల మధ్యలో ప్లాస్టిక్​ కవర్, దుప్పటిలో చుట్టిన మహిళ శవాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పడేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో క్లూస్​ టీంకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు. ఆమె వయసు సుమారు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి, ఇక్కడ తెచ్చి పడేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మహిళ శరీరంపై పసుపు రంగు దుస్తులు ఉన్నాయని, మహిళ రెండు చెవులు కత్తిరించి, చెవి కమ్మలు తీసేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించామని, రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి విషయాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed