అధైర్య పడొద్దు నేనున్నా.. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి..

by Sumithra |
అధైర్య పడొద్దు నేనున్నా.. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి..
X

దిశ, చేవెళ్ల : అధైర్య పడొద్దు నేను అండగా ఉంటా అని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పార్టీ మారడంతో నియోజకవర్గ పరిధిలోని మొయినబాద్ మండల బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర నేత కొంపల్లి అనంత్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ మాకు పెద్దదిక్కు సబితమ్మ అంటూ నినదించారు.

నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని, గత ఎన్నికల్లో పోరాడి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని, నేడు ఎమ్మెల్యే పార్టీ మారటంతో ఇక నుంచి మీరే మాకు అండగా ఉండాలని వారు సబితమ్మను కోరారు.

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ స్పందిస్తూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న వారే నిజమైన నేతలని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పార్టీ కోసం గతం కన్నా ఎక్కువగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో మొయినాబాద్ మండలంలోని బీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed