కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి

by Sridhar Babu |
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి
X

దిశ, మీర్ పేట్ : కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కార్పొరేషన్ లోని గాయత్రీ నగర్, జిల్లెలగూడ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహేశ్వరం బీజేపీ ఇన్​చార్జి శ్రీ రాములుతో కలిసి ఆయన లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పదవులను సైతం లెక్కచేయని త్యాగధనుడు అన్నారు.

బడుగు, బలహీన వర్గాల చైతన్యానికి ప్రతీక బాపూజీ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలన్ శంకర్ రెడ్డి , మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మద్ది రాజశేఖర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు గోవర్ధన్ రెడ్డి, కరుణానిధి, శ్రవణ్ కుమార్, ఇంద్రావతి రవి నాయక్, అనిత ప్రభాకర్ రెడ్డి, గౌరీ శంకర్, ప్రధాన కార్యదర్శులు గాజుల మధు, సోమేశ్వర్, తిరుపతి రెడ్డి, రవి నాయక్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు చింతల రాఘవేందర్ ముదిరాజ్, రవీందర్ రెడ్డి, గడ్డం జగన్, విక్కీ సాగర్, కాశీరాం యాదవ్, జగన్ ముదిరాజ్, నిఖిల్ సింగ్, పద్మశాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story