కాంగ్రెస్ కు ప్రజా బలం లేదు : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Disha Web Desk 11 |
కాంగ్రెస్ కు ప్రజా బలం లేదు : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ,మహేశ్వరం: కాంగ్రెస్ పార్టీకి ప్రజా బలం లేదని చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కందుకూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... తప్పుడు ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. నామినేషన్ కు ముందే ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం లో ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టానని తెలిపారు.

ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. గ్రామాలలో యాత్ర చేస్తున్న సమయంలో మహిళలు, ప్రజలు, యువకులు ఘన స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు. మూడు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నానన్ని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా బీజేపీకే ఓటు వేస్తారన్నారు. రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నపుడు కాంగ్రెస్ నాయకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహ రెడ్డి, పలువురు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed