ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేష‌న్ విడుదల

by Disha Web Desk 12 |
ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేష‌న్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే దోస్త్ నోటిఫికేషన్ ను శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేయనున్నారు. ఆయా డిగ్రీ కాలేజీల్లో ఫ‌స్టియ‌ర్‌లో ప్రవేశాలకు దోస్త్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా మూడు విడతల్లో ఈ ప్రక్రియ ద్వారా ప్రవేశాలు చేపట్టనున్నారు.

ఇంట‌ర్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గడువు పొడిగింపు

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు తేదీని పొడిగించారు. ఈ మేరకు బోర్డు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 4వ తేదీ వ‌ర‌కు విద్యార్థులు ప‌రీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని స్పష్టంచేశారు. వాస్తవానికి ఇంట‌ర్ ప‌రీక్ష ఫీజు చెల్లింపు గురువారంతో పూర్తయింది. కానీ విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే కారణంగా 4వ తేదీ వరకు పొడిగించారు. ఇదిలా ఉండగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జరగనున్నాయి.

Next Story

Most Viewed