చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్​ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి

by Disha Web Desk 11 |
చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్​ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి
X

దిశ, బడంగ్ పేట్​ : మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న పార్టీలకు చమరగీతం పాడాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట్​ మేయర్​ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. లోక్​ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా గురువారం కాంగ్రెస్​ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ లో ఆర్చిడ్ కాలనీ, మెట్రో సిటీ కాలనీ, సి.పి.ఎన్.ఆర్ కాలనీ లలో ప్రచారం నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంట్​ కాంగ్రెస్​ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్​ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జి నిజాముద్దీన్, బడంగ్ పేట్​ మున్సిపల్ కార్పొరేషన్ మైనారిటీ చైర్మన్ అఫ్జల్, బాలింగని జంగయ్య ,రియసత్,బాబా భాయ్,మెహముద్, రియాజ్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed