మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

by Disha Web Desk 12 |
మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, రాజేంద్రనగర్ : ఇంటర్ ఫెయిల్ కావడంతో మనస్థాపం చెందిన ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ డివిజన్ పరిధిలోని హైదర్‌గూడ కు చెందిన హరిణి ఇంటర్ మొదటి సంవత్సరం బైపిసి చదువుతుంది. నిన్న వెలువడిన న ఫలితాలు ఆమె ఓ సబ్జెక్టు ఫెయిల్ అయింది. దీంతో మనోవేదనకు గురైన ఆమె వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story