తెలంగాణలో వర్షం.. మండు వేసవిలో భారీ ఉపశమనం

by Disha Web Desk 9 |
తెలంగాణలో వర్షం.. మండు వేసవిలో భారీ ఉపశమనం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సిద్దిపేట, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. అలాగే హైదారాబాదు నగరంలో ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, కర్మన్ ఘాట్, చంపాపేట్, చాంద్రాయణగుట్ట , బాలాపూర్ సహా పలు ప్రాంతాల్లో కూడా వర్షం కూడా వర్షం పడుతోంది. దాదాపు రెండు నెలల నుంచి ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు కాస్త ఉపశమనం కలిగింది. కానీ వరి కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు ఆరబోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక వానల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Next Story

Most Viewed