Prashant Kishor:అక్టోబర్ 2న కొత్త రాజకీయ పార్టీ: ప్రశాంత్ కిశోర్

by Prasad Jukanti |
Prashant Kishor:అక్టోబర్ 2న కొత్త రాజకీయ పార్టీ: ప్రశాంత్ కిశోర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పొలిటికల్ పార్టీ అనౌన్స్ మెంట్ కు ముహుర్తం ఫిక్స్ అయింది. అక్టోబర్ 2న బిహార్ లో కొత్త పార్టీ ప్రారంభించబోతున్నట్లు ఆదివారం ఆయన స్పష్టం చేశారు. అదే రోజున పార్టీ పేరు, నాయకత్వ వివరాలు వెల్లడిస్తానన్నారు. అయితే పార్టీ నాయకత్వం విషయంలో ప్రశాంత్ కిశోర్ ట్విస్ట్ ఇచ్చారు. పార్టీ ప్రకటించబోతున్నప్పటికీ ఆ పార్టీ నాయకత్వం మాత్రం తన చేతుల్లో ఉండదన్నారు. బిహార్ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రశాంత్ కిశోర్ 2 అక్టోబర్ 2022న జన్ సురాజ్ యాత్ర పేరుతో ఆ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన ప్రారంభించారు. ఈ యాత్ర రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా మీడియాతో ఇవాళ మాట్లాడారు. ఇప్పటి వరకు 60 శాతం యాత్ర పూర్తయిందని మిగతా యాత్ర కంటిన్యూ అవుతుందన్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా పార్టీని ట్రాక్ పైకి తీసుకురాబోతున్నట్లు ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. అయితే ఆపార్టీకి నేనెప్పుడు నాయకుడిని కాదని, అలా ఉండాలనీ నేనెప్పుడూ అనుకోలేదన్నారు.

Advertisement

Next Story