Ponnam: రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

by Ramesh Goud |
Ponnam: రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, రోడ్ సేఫ్టీపై విద్యార్ధులకు అవగాహాన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. బుధవారం రవాణా శాఖలో ఆదాయ మార్గాలను పెంచేందుకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రవాణా ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, కమిషనర్ ఇలంబత్రి, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు రమేష్, మమతలు పాల్గొన్నారు. గతంలో సీఎం నిర్వహించిన సమీక్షలో చేసిన సూచనలు ఎంత వరకు ముందుకు వెళ్తున్నాయని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ఆటోలలో విద్యార్థులను తీసుకొని ఓవర్ లోడ్ తో తీసుకెళ్తున్న వారిపై అధికారులు తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ప్రతి విద్యార్థికి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, రాజ్ భవన్ స్కూల్‌లో రోడ్ సేఫ్టీ కార్యక్రమం కోసం ఇప్పటికే 5 లక్షలు మంజూరు చేశామని, విద్యార్థులకు రోడ్డు సేఫ్టీ పై ఆధునిక సాంకేతిక పద్ధతిలో కరికులం ఉండాలని తెలిపారు. ప్రతి సంవత్సరం దేశంలో రోడ్డు ప్రమాదాలలో లక్షా 60 వేల మంది మరణిస్తుండగా.. తెలంగాణలో 20 మంది మృత్యువాత చెందుతున్నారని వీటిని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని, మోటార్ వాహన చట్టం ప్రకారం వారి లైసెన్స్ లు రద్దు చేయాలని సూచించారు.

ఇక స్క్రాప్ పాలసీ, ఆటోమాటిక్ టెస్టింగ్ స్టేషన్స్ ఇతర రవాణా పాలసీలను అధ్యయనం చేయడానికి రవాణా శాఖ అధికారుల బృందం వివిధ రాష్ట్రాలను సందర్శించించి, ఇచ్చిన నివేదిక పై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సూచనలు చేశారు. అలాగే దానిపై మరోసారి తుది నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. రవాణా శాఖ కార్యాలయాలు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న వాటి లిస్ట్ తీసి ఎక్కడెక్కడ ఉన్నయో.. అక్కడ కలెక్టర్ లకి ప్రభుత్వ స్థలాల కోసం లెటర్స్ పెట్టాలని చెప్పారు. ఇక ఫీల్డ్ లో ఉపయోగకరంగా ఉండేందుకు రవాణా శాఖ అధికారులకు టాబ్స్ ఇవ్వడంతో పాటు వారి ఫీల్డ్ విజిట్ చేయడానికి వాహన సౌకర్యం ఏర్పాటు చేయాలని, రేషన్లైజడ్ ప్రాసేస్ లో రెవెన్యూ టార్గెట్స్ ను పెంచాలని, అన్ని నిబంధనలు పాటిస్తున్న ప్రయాణికులపై రవాణా శాఖ అధికారులు ఇబ్బందులు పెట్టకుండా జాగ్రత్తలు వహించాలని అధికారులను ఆదేశించారు.

Next Story

Most Viewed