Group 1 : గ్రూప్-1 మెయిన్స్ పై హైకోర్టులో పిటిషన్

by M.Rajitha |
Group 1 : గ్రూప్-1 మెయిన్స్ పై హైకోర్టులో పిటిషన్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్(Group 1 Mains) పరీక్షల వ్యవహారం మరోసారి కోర్టుకెక్కింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై పలువురు అభ్యర్థులు హైకోర్టు(High court)లో పిటిషన్ దాఖలు చేశారు. మెయిన్స్ పేపర్ వాల్యుయేషన్(Valuation) పై సరిగా జరగలేదని.. 18 పేపర్లు ఉంటే కేవలం 12 మంది నిపుణులతోనే వాల్యుయేషన్ జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు. 3 భాషల్లో పరీక్ష జరిగితే సరైన నిపుణులతో వాల్యుయేషన్ చేయించలేదని ఆరోపించారు. ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయినట్టు తెలిపారు. ఒక్క నిపుణుడితోనే తెలుగు ఇంగ్షీషు మీడియం పేపర్లు దిద్దించారని.. దీనివల్ల నాణ్యతలో లోపం ఉందని అన్నారు.

కాగా పిటిషనర్ వాదనలు విన్న అనంతరం హైకోర్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది ధర్మాసనం. తెలంగాణలో 563 గ్రూప్ 1 పోస్టులకు మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుండి 27 వరకు నిర్వహించింది టీజీపీఎస్సీ. వీటికి సంబంధించిన ప్రొవిజనల్ మార్కుల జాబితాను మార్చి 10న విడుదల చేసింది.

Next Story

Most Viewed