Mahesh Kumar Goud: మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీ టూర్

by Prasad Jukanti |   ( Updated:2024-10-25 05:58:23.0  )
Mahesh Kumar Goud: మహేశ్ కుమార్ గౌడ్  ఢిల్లీ టూర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఇవాళ, రేపు ఆయన ఢిల్లీ టూర్ లో ఉండనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. అలాగే రేపు వీహెచ్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలోనూ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ లో కార్యవర్గ కూర్పుతో పాటు మంత్రివర్గ విస్తరణ, పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై జీవన్ రెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ అధిష్టానంతో పీసీసీ చీఫ్ జరపబోయే చర్చలు కీలకంగా మారనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed