సీఎం రేవంత్ రెడ్డితో నోకియా జర్మనీ బృందం భేటీ

by Ramesh N |
సీఎం రేవంత్ రెడ్డితో నోకియా జర్మనీ బృందం భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మరో దిగ్గజ కంపెనీ బృందం సమావేశం అయింది. ఇటీవల వరుసగా అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్‌తో భేటీ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో నోకియా జర్మనీ ప్రతినిధి బృందం మర్యాదపూర్వక భేటీ అయింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి పూల బొకే అందజేశారు. అనంతరం వారితో ముఖ్యమంత్రి కాసేపు చర్చలు జరిపారు. తెలంగాణలో కంపెనీ పెట్టుబడుల నేపథ్యంలో సీఎంను నోకియా జర్మనీ బృందం కలిసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో నోకియా గ్లోబల్ హెడ్ మార్టీన్, సేల్స్ హెడ్ మ్యాన్క్, గ్లోబల్ డైరెక్టర్ వెంకట్, రాజేష్, సీస్ రావ్, పద్మజ, ఎమ్మెల్యే మదన్ మోహన్ తదితరులు ఉన్నారు.

ఇదిలా ఉండగా.. అంతకు ముందు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇండియన్ పారా సైక్లింగ్ టీమ్ కలిసింది. వారితో సీఎం రేవంత్ కాసేపు ముచ్చటించారు.

Advertisement

Next Story

Most Viewed