బయటపడ్డ జిల్లా కిసాన్ ఖేత్ కాంగ్రెస్ అధ్యక్షుడి రాసలీలలు

by Mahesh |
బయటపడ్డ జిల్లా కిసాన్ ఖేత్ కాంగ్రెస్ అధ్యక్షుడి రాసలీలలు
X

దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, జిల్లా కిసాన్ ఖేత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ముప్పా గంగారెడ్డి రాసలీలలు బహిర్గతమయ్యాయి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండలం, నర్సింగ్ పల్లి గ్రామానికి చెందిన ఓ బీడీ కార్మికురాలితో గంగారెడ్డి రహస్యంగా 20 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాడని బాధితురాలు వాపోయింది. తమకు పుట్టిన కుమారుడిని, సైతం తమకు పుట్టలేదని, గంగారెడ్డి అంటున్నారని తాను డీఎన్ఏ పరీక్షకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.

తాను గుండె సంబంధిత వ్యాధితో పాటు, అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానని, ఈ విషయంలో గంగారెడ్డికి డబ్బుల కోసం సంప్రదిస్తే, చంపుతానని బేదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని బాధిత మహిళ తన కుమారుడితో కలిసి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. కలెక్టరేట్ AO కి ఫిర్యాదు చేసింది. 20 సంవత్సరాల క్రితం తనను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఇప్పటివరకు వివాహం చేసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, తాను అంత చూసుకుంటానని, బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు మీడియా ముందు వాపోయింది. తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటుంది.

నేను బిజీగా ఉన్నా.. ఇప్పుడు మాట్లాడను

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి రాసలీలలకు పాల్పడుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో దిశ ముప్పా గంగారెడ్డిని సంప్రదించగా.. నేను ఆ విషయం ఇప్పుడు మాట్లాడలేను. ఎవరికి నేను సంజాయిషీ ఇచ్చుకునే అవసరం లేదని దాటవేసే ప్రయత్నం చేశారు ముప్ప గంగారెడ్డి. అలాగే ఆ మహిళ ఎవరో తనకు తెలియదని నాకు ఆ మహిళకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story