కుంభమేళ పరిసరాల్లో మాంసం, మద్యపానం నిషేధం

by Mahesh Kanagandla |
కుంభమేళ పరిసరాల్లో మాంసం, మద్యపానం నిషేధం
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే సంవత్సరం జనవరిలో యూపీలో మహాకుంభ మేళా ఉత్సవాలు మొదలు కానున్నాయి. ఫిబ్రవరి నెల చివరి వారంలో ముగిసే ఈ మహాకుంభ మేళ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే సీఎం యోగి ఆదిత్యానాథ్ 13 అఖాడాలు, ఖాక్ చౌక్, దాండి బారా, ఆచార్య బారాలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత సీఎం ఓ ప్రకటన విడుదల చేశారు. సనాతన సమాజ మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మహాకుంభ మేళ పరిసర ప్రాంతాల్లో మాంసం, మద్యం క్రయ విక్రయాలపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మాంసం భుజించడం, మద్యపానం సేవించడాన్ని కూడా నిషేధిస్తున్నట్టు వివరించారు.

అలాగే.. మహాకుంభ మేళా కోసం నదులను పరిశుభ్రం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఇందుకు సాధువుల సహకారం కూడా అవసరమని తెలిపారు. మహాకుంభ మేళా సమయంలో విముక్తి పొందిన సాధువులకు ప్రయాగ్‌రాజ్‌లోనే సమాధుల కోసం స్థలాన్ని కేటాయిస్తామని పేర్కొన్నారు. సంపూర్ణంగా పరిశీలించే వరకూ తమ ఆశ్రమాల్లోకి ఎవరికీ రిజర్వ్ చేయరాదని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story