లారీ టైర్ల కింద పడి యువకుడు దుర్మరణం

by Sridhar Babu |
లారీ టైర్ల  కింద పడి యువకుడు దుర్మరణం
X

దిశ, భిక్కనూరు : హైవేపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనకాల నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన భిక్కనూరు మండలం బస్వాపూర్ వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన బాయికాడి ఎల్లేశం (29) భిక్కనూరులో పనులు ముగించుకొని తిరిగి గ్రామానికి వెళ్తుండగా అదే దారిలో వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం ఒక సైడ్ పడగా, ఎల్లేశం లారీ టైర్ల కింద పడి మృతి చెందాడు. అయితే ప్రమాదానికి కారణమైన లారీ ఆపకుండానే పారిపోతుండగా గ్రామస్తులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. మృతుడు ఎల్లేశం గ్రామంలోని కల్లు దుకాణంలో లేబర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మేరకు ఎస్ఐ సాయి కుమార్ నేతృత్వంలోని పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed