బీజేపీ మేనిఫెస్టోతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు దిమ్మతిరిగింది

by Sridhar Babu |
బీజేపీ మేనిఫెస్టోతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు దిమ్మతిరిగింది
X

దిశ, ఆర్మూర్ : బీజేపీ మేనిఫెస్టో తో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు దిమ్మతిరిగి పోయిందని బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ అన్నారు. ఆదివారం బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండలంలోని అక్లూర్, వెంకటాపూర్ గ్రామాలలో అన్నపూర్ణమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ మానిఫెస్టోలో తెలంగాణ ప్రజలకు లబ్ధిచేకూరే అనేక పథకాలను పొందు పరిచారన్నారు. వరి వేస్తే ఉరి అన్నోడు కావాలా ? లేక క్వింటాల్ వరికి 3100 రూపాయలు మద్దతు ధర ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోవాలని ప్రజల్ని కోరారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఆడబిడ్డ పుడితే 2 లక్షల రూపాయలు పాప పేరుమీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ హైదరాబాద్ వేదికగా

ప్రకటించడంతో భీంగల్ మండలం బెజ్జోరా గ్రామానికి చెందిన మాదిగ సంఘం మహిళలు మద్దతు తెలిపారు. మానాల వీరున్ తండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉపసర్పంచ్ లౌడ్య నరహరి బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నాయకులు కర్ణాటక రాష్ట్రంలో ప్రజలను మోసంచేసినట్టు తెలంగాణలో కూడా మోసంచేయడానికి ఆరు గ్యారంటీల పేరుతో ముందుకు వస్తున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ప్రతి వ్యక్తికి న్యాయం జరుగుతుందన్నారు. బాల్కొండలో బీజేపీ గెలిపిస్తే అర్హులందరికీ ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్, మండల అధ్యక్షులు ఏలేటి రమేష్ రెడ్డి, కాంతయ్య, రాజగంగారాం, ప్రశాంత్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed