ఘోర రోడ్డు ప్రమాదం.. భార్య మృతి భర్త పరిస్థితి విషమం

by Mahesh |   ( Updated:2024-03-04 07:39:04.0  )
ఘోర రోడ్డు ప్రమాదం.. భార్య మృతి భర్త పరిస్థితి విషమం
X

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. సదాశివనగర్ కు చెందిన ఏనుగు జనార్దన్ రెడ్డి (49), అతని భార్య ప్రతిభ(42) లు పద్మాజివాడి గ్రామంలో బంధువుల అంత్యక్రియలకు స్కూటీ పై వెళ్తుండగా పద్మాజివాడి యూటర్న్ వద్ద వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రతిభ నుజ్జునుజ్జు అయి మృతి చెందగా, ఆమె భర్త జనార్దన్ రెడ్డి తీవ్రంగా గాయపడినట్లు సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed