- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
గోవా ట్రిప్పుకు వెళ్లిన ఖాకీలు ఎందరు ?
దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న కొందరు పోలీస్ అధికారులు, సిబ్బంది ఇటీవల గోవా టూర్ కు వెళ్లిన వ్యవహారం పై పోలీస్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. ఇటీవల జిల్లాలోని నందిపేట్ మండలంకు చెందిన ఓ యువ నేత గోవా టూర్ కు వెళ్లిన అనంతరం ఆకస్మికంగా చనిపోయారు. అతని ఆధ్వర్యంలో విడతల వారిగా గోవా టూర్ కు వెళ్లారు. అందులో కొందరు విహార యాత్రకు వెళ్లగా కొందరు క్యాసినో ఆడేందుకు వెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అక్కడ
టూర్ కు వెళ్లిన వారి వివరాలను ట్రావెల్ ఏజెంట్ ద్వారా సేకరిస్తున్నారు. వీరిలో గతంలో నవిపేట్ లో విధులు నిర్వహించిన ఎస్ఐ, ఇప్పుడు అదిలాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వారు ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా నవిపేట్ లో , నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఇద్ధరు కానిస్టేబుళ్లు ఉన్నట్లు విచారణలో తెలింది. సంబంధిత రిపోర్టు జిల్లా పోలీస్ బాస్ కు చేరింది. అనుమతి లేకుండా రాష్ర్టం సరిహద్ధులు దాటినందుకు చర్యలకు సిద్ధమైనట్లు పోలీస్ శాఖలో చర్చ మొదలైంది.