- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఉపాధి హామీ పనుల్లో అధికారుల పర్యవేక్షణ ఏది..?
దిశ, తాడ్వాయి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్నా కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పని ప్రాంతంలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు గాను టెంట్లు, తాగేందుకు నీటి వసతి, గాయాలైతే ఫస్ట్ఎయిడ్ కిట్లు ఇవేవి అందుబాటులో లేక కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ఎర్రటి ఎండలో పని చేసిన కూలీలు కొద్ది సేపైనా సేద తీరడానికి టెంట్లు వేయాల్సి ఉంది. కానీ ఎక్కడ టెంట్లు వేయకపోవడంతో కూలీలకు స్థానికంగా నిల్వ నీడ కరువవుతోంది.
దీంతో చెట్ల కింద, ట్రాక్టర్ వాహనాల క్రింద కొందరు సేద తీరుతున్నారు. దూర ప్రాంతాల్లో పని చేసేందుకు రవాణా వసతి కల్పించాలన్న నిబంధన ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఉపాధి హామీ కూలీలు మండుటెండులను సైతం లెక్క చేయకుండా కనీస సౌకర్యాలు కల్పించనప్పటికీ కూడా పనులు చేస్తున్నా సమయానికి డబ్బులు అందడం లేదని కూలీలు ఆరోపిస్తున్నారు. కూలీలకు విధిగా వసతులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినా మండల స్థాయిలో అధికారులు లెక్క చేయడం లేదనె ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.