ఐటీ రంగాన్ని మరింత డెవలప్ చేస్తాంః మంత్రి శ్రీధర్ బాబు

by Nagam Mallesh |
ఐటీ రంగాన్ని మరింత డెవలప్ చేస్తాంః మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, భిక్కనూరుః రాష్ట్రంలో ఐటీ రంగాన్ని మరింత డెవలప్ చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో పని చేస్తుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి హైదరాబాదులో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డితో కలసి పర్యటించిన ఆయన పెట్టుబడుల విషయమై ముచ్చటించారు. హైదరాబాదులో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ముందుకు వచ్చాయని, ఐటీని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పినట్లు టీపీసీసీ కార్యదర్శి కరణ్ రెడ్డి "దిశ" తో మాట్లాడుతూ వివరించాడు.

Next Story

Most Viewed