పిల్లల కిడ్నాప్ ముఠాలపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

by Sridhar Babu |
పిల్లల కిడ్నాప్ ముఠాలపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
X

దిశ, కామారెడ్డి : గత కొద్దిరోజులుగా కామారెడ్డి జిల్లాలో చిన్న పిల్లలను కిడ్నాప్ కోసం ముఠాలు సంచరిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో అనుమానాస్పదంగా ఎవరు కనపడినా పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురిని కాలనీ వాసులు గుర్తించారు. అందులో నలుగురు పారిపోగా ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాలనీ వాసులు తెలిపిన వివరాల ప్రకారం..

కామారెడ్డి పట్టణంలోని పెద్ద బజార్ లో ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించారు. ఇద్దరు చిన్నపిల్లలను కిరాణా షాపుకు తీసుకెళ్లడం కాలనీ వాసులు గమనించారు. చిన్న పిల్లల కిడ్నాప్ ముఠా సంచారం అంటూ వస్తున్న వదంతుల నేపథ్యంలో కాలనీ వాసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా అందులో నలుగురు పారిపోయారు. దొరికిన మగమనిషి, ఆడ మనిషికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కాలనీకి చేరుకుని వివరాలు సేకరించారు. సదరు వ్యక్తులు యాచకులని తేలిందని పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed