పోలీస్ కస్టడీ నుంచి ఇద్దరు దొంగల పరార్

by Mahesh |   ( Updated:2024-04-02 06:15:43.0  )
పోలీస్ కస్టడీ నుంచి ఇద్దరు దొంగల పరార్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు దొంగలు పరారీ అయ్యారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది.. ఇటీవల ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ఇళ్లలో దొంగతనం చేసిన ముగ్గురిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అందులో నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన షేక్ సిరాజ్, నగరంలోని ఆటోనగర్ అక్బర్ బాగ్ చెందిన సయ్యద్ జీషన్ పరారీ అయ్యారు. రాత్రి విధుల సమయంలో పోలీసులు ఏమార్పాటు గా ఉండడానికి గమనించి పోలీస్ పోలీస్ కస్టడీ నుంచి ఇద్దరు దొంగలు పరారీ అవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారి కోసం గాలింపు జరుగుతోంది. పోలీసులు శివారు ప్రాంతాలకు చెందిన పోలీస్ స్టేషన్ ల అధికారులకు సమాచారం అందించి పరారీ అయిన వారిని పట్టుకుని ప్రయత్నంలో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed