ఆర్టీసీ బస్సు ఎక్కడంతో నుజ్జునుజ్జైన మహిళ రెండు కాళ్ళు

by Anjali |
ఆర్టీసీ బస్సు ఎక్కడంతో నుజ్జునుజ్జైన మహిళ రెండు కాళ్ళు
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ - ఆర్మూర్ బస్టాండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తోన్న క్రమంలో ఓ మహిళ రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. వివరాల్లోకెళ్తే.. 50 ఏళ్ల సుజాత అనే మహిళ బస్సు ఆపమంటూ వెనక బస్సు నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది. మహిళను గమనించని ఆర్టీసీ బస్సు బస్సు డ్రైవర్ బస్సు వెనక్కి తీస్తున్న క్రమంలో బస్సు వెనక చక్రాలు ఆమె రెండు కాళ్లపై నుంచి పోనించాడు. దీంతో సుజాత రెండు కాళ్లు నుజ్జు త్రీవ రక్త స్రావం అయ్యాయి. సమాచారం అందుకున్న ఆర్మూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న సుజాతను ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోవడానికి కారణాలు.. కొన్నిసార్లు ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కాకుండా ప్రయాణికులు తప్పిదం కూడా ఉంటుందని జనాలు భావిస్తున్నారు.

Next Story

Most Viewed