- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
తిమ్మాపూర్ చెరువులో ఇద్దరు గల్లంతు
దిశ, బాన్సువాడ : కాల కృత్యాలు తీర్చుకోడానికి చెరువులో దిగిన ఒక మిత్రుడు చెరువులో మునిగిపోతుండగా మరొక యువకుడు కాపాడడానికి ప్రయత్నించి అతను కూడా చెరువులో పడి గల్లంతయ్యారు. ఈ సంఘటన సోమవారం ఉదయం కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం తిమ్మాపూర్ శివారులోని అంకుస్ గని చెరువులో చోటుచేసుకుంది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బాలేష్ (18), గణేష్ (16) ఇద్దరు కలిసి ఉదయం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై చెరువు కట్ట వద్దకు వెళ్లారు. గణేష్ చెరువులో దిగగా ప్రమాదశత్తు నీటిలో పడిపోయాడు. నీటిలో పడిపోయిన గణేష్ ను బాలిష్ రక్షించడానికి ప్రయత్నించి అతను కూడా చెరువులో మునిగిపోయాడు.
ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరూ ఇంటికి చేరకపోవడంతో సోమవారం సాయంత్రం సమయంలో వారి కుటుంబ సభ్యులు గాలిస్తుండగా చెరువు కట్ట వద్ద ద్విచక్ర వాహనం, చెప్పులను గుర్తించారు. వారు ఇద్దరూ చెరువులో గల్లంతయినట్లు గుర్తించారు. చుట్టుపక్కల వారు వచ్చి చెరువులో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. రాత్రి వరకు కూడా వారిద్దరి ఆచూకీ లభించలేదు. గజ ఈతగాలతో చెరువులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గణేష్ బీర్కూర్ లో 10వ తరగతి చదువుతున్నాడు. బాలేష్ బీర్కూరులో మోటార్ మెకానిక్ గా పనిచేస్తున్నారు . ఓకే గ్రామానికి చెందిన ఇద్ధరు చెరువులో గల్లంతు కావడంతో రెండు కుటుంబాలలో విషాదం నెలకొంది.