- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
నార్కోటిక్ డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
వదిశ, కామారెడ్డి: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం నిజామాబాద్ డివిజన్ అధికారులు శుక్రవారం కామారెడ్డి పట్టణ శివారులో నిర్వహించిన దాడులలో కల్తీ కల్లులో కలిపే మత్తు పధార్థం అల్ఫాజోలం (నార్కోటిక్ డ్రగ్స్)ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్ మాట్లాడుతూ...నార్కోటిక్ డ్రగ్స్ ను రవాణా చేస్తున్న కదిరి సాగర్ గౌడ్, మాడుగుల సాగర్ గౌడ్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్దనున్న సుమారు రూ. 5 లక్షల విలువచేసే 900 గ్రాముల ఆల్పాజోలం (నార్కోటిక్ డ్రగ్స్)ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే వీరి వద్ద గల రెండు బైకులు, రెండు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇక ముందు కూడా ఎవరైనా మత్తు పదార్థాలను అమ్మినా, కొనుగోలు చేసిన, రవాణా చేసినా ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐలు వెంకటేష్, స్వప్న, ఎస్సై రాజ్ కుమార్, సిబ్బంది శ్రీను, ప్రసాద్, ఉత్తం, భోజన్న, విష్ణు, అవినాష్, రామ్ బచ్చన్ పాల్గొన్నారు.